telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలి: మంత్రి బొత్స

సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఇంఛార్జి మంత్రి హోదాలో సోమవారం తొలిసారి అనంతపురం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయటమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.

పథకాలను అర్హలందరికీ నిష్పక్షపాతంగా అందజేయాలని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts