ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ తో సీఎం జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్ లో బిశ్వభూషణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశంతోపాటు రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్తో సీఎం చర్చించనున్నారు.
రైతుల ఆందోళనలపై గవర్నర్కు వివరించే అవకాశం ఉంది. అలాగే జీఎన్ రావు కమిటీ నివేదిక, ప్రతిపక్షాల ఆందోళనలపై ఇరువురి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా ఉన్నారు. గవర్నర్ దంపతులను జగన్ దంపతులు శాలువాలతో సత్కరించారు.