మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే “ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల చిత్రం నుండి విడుదలైన “నో పెళ్లి” అనే సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పదేళ్ళుగా హిట్ కోసం ఆరాటపడుతున్న దర్శకుడు వీరూ పోట్ల త్వరలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో చిత్రం తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. శ్రీకృష్ణ దేవరాయ పాలన నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాజుగా కనిపించనున్నాడు తేజు. అనీల్ సుంకర నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అతి త్వరలో పూర్తి క్లారిటీ రానుంది.
next post