దుబాయిలోని ఓ హోటల్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన 25 ఏళ్ల వెయిటర్ హోటల్ మూసేసిన తరువాత క్యాష్ బాక్స్ నుంచి డబ్బును దొంగిలించాడు. ఎదురుగా సీసీ కెమెరా ఉందనే విషయం గుర్తొచ్చి అనంతరం కెమెరా పవర్ను కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పవర్ కట్ చేస్తే తాను దొంగతనం చేసింది రికార్డ్ అవ్వదేమోనని వెయిటర్ అనుకున్నాడు. అనంతరం క్యాష్ బాక్స్ చూసిన భారతీయ క్యాషియర్ ఒక్కసారిగా షాకయ్యాడు. హోటల్లోని ఇతర సిబ్బందిని అడగగా.. వారికి తెలీదని సమాధానమిచ్చారు. దీంతో సీసీ ఫుటేజ్ను పరిశీలించగా.. హోటల్లో పనిచేసే వెయిటర్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు రికార్డయింది. కాగా.. దొంగతనం చేసిన మూడు రోజుల తరువాత వెయిటర్ హోటల్కు వెళ్లాడు. తాను దొంగతనం చేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తానంటూ క్యాషియర్కు వివరించాడు. హోటల్ యాజమాన్యం మాత్రం వెయిటర్పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
previous post