telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ కు రాంచీ కోర్టు సమన్లు!

rahul gandhi fire on modi in campaign

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాంచీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ వీరందరికీ కామన్ గా మోదీ అని ఎందుకుంది? ఎందుకంటే దొంగలందరి ఇంటి పేరు మోదీనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాబోయే కాలంలో ఇంకెంత మంది మోదీలు బయటపడతారో అని రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సివిల్ కోర్టులో భోపాల్ కు చెందిన ప్రదీప్ మోదీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీంతో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రదీప్ మోదీ మాట్లాడుతూ, కావాలనుకుంటే మీరు సంబంధిత వ్యక్తుల పేర్లతో ఆరోపణలు చేసుకోవచ్చని, ఒక సామాజికవర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం సరి కాదని అన్నారు.

Related posts