అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సినిమా “మజిలీ”. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో రూపొందిన “మజిలీ” చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో సమంతతో పాటు దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఇక ఇప్పుడు సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా వరుస వీడియోలను విడుదల చేస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. పెళ్లి తరువాత సమంత, నాగ చైతన్య మొదటి సారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకులు సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణను పొందుతుందో చూడాలి.
#Majili gets U/A. The journey begins on 5th April.
Book your tickets here: https://t.co/uHMhfFbmrv@chay_akkineni @Samanthaprabhu2 @divyanshak10 @ShivaNirvana @sahrudayg @harish_peddi @VishnuSarmaDOP #GopiSundar @MusicThaman @sahisuresh #MajiliOnApr5th #MajiliBeginsIn3Days pic.twitter.com/CI9QoclUlT
— BARaju (@baraju_SuperHit) April 2, 2019
బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీకి ఎందుకు రాలేదంటే… నందమూరి చిన్నల్లుడి కామెంట్స్