రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ని చూపించనున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గనులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనులపై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్నదానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ సమర్పించారు. కన్నడం, హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ శరవేగంగా పూర్తవుతోంది. తాజాగా ఈ సినిమాలోని అధీరా పాత్రలో ఉన్న సంజయ్ దత్ లుక్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. సంజయ్దత్ లుక్కి చక్కని స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలలో శ్రీనిధి శెట్టి, శరణ్ శక్తి కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోలార్ ఫీల్డ్స్లోని సైనైడ్ హిల్స్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ షూటింగ్ వలన అక్కడి పర్యావరణానికి హానికలుగుతుందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అతని వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయస్థానం వెంటనే సైనైడ్ హిల్స్లో జరుగుతున్న కేజీఎఫ్ 2 షూటింగ్ను ఆపాలని ఆదేశాలిచ్చింది. దీంతో చిత్ర బృందం మరో లొకేషన్ వెతికే పనిలో పడింది. సెప్టెంబర్ 28 నుండి తదుపరి షెడ్యూల్ ప్రారంభించాలని టీం భావిస్తోంది.