తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం గా సిఎం తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు సుఖ శాంతులతో ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆగస్టు 22న ఆదివారం దేశవ్యాప్తంగా ‘రక్షాబంధన్’ జరగనుంది.
previous post
సీపీఐ, సీపీఎంలు పార్టీ సిద్ధాంతాలను అమ్ముకున్నాయి: బీజేపీ నేత