బాలీవుడ్ నటి కాజోల్కు ఆమె కూతురు నైసాకు కరోనా వైరస్ సోకిందన్న వార్తలు వినిపించాయి. సింగపూర్లో విద్యనభ్యసిస్తున్న కాజోల్ కూతురు నైసాను రిసీవ్ చేసుకోవడానికి కాజోల్ ముంబై ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో నైసా ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారని.. కాజోల్కు కూడా ప్రమాదం పొంచి ఉందంటూ వదంతులు వ్యాపించాయి. ఈ రూమర్లపై స్పందించిన అజయ్ దేవ్ గన్.. ‘‘మీరు ఈ విషయం గురించి అడుగుతున్నందుకు ధన్యవాదాలు. కాజోల్, నైసా బాగున్నారు. వారి ఆరోగ్యం గురించి ప్రచారం అవుతున్న పుకార్లు అవాస్తవాలు అని తెలియజేసారు.
వివాహ వ్యవస్థపై సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు