జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శలు గుప్పించారు. కాపు యువత తమ సొంత డబ్బు ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.పవన్ కల్యాణ్ నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని భుజాలపై మోసేందుకు ప్రయత్నించారు తప్ప కాపులకు జరిగిన అన్యాయాలపై పవన్ ప్రశ్నించలేదని అన్నారు.గత టీడీపీ ప్రభుత్వ పాలనలో రూ.1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు.
తక్కువ నిధులు ఖర్చు చేయడంపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని జక్కంపూడి రాజా నిలదీశారు. కాపు రిజర్వేషన్ల గురించి అడిగిన ముద్రగడ పద్మనాభంతో పాటు వేలమందిపై కేసులు పెట్టారని, అప్పుడు కూడా పవన్ ప్రశ్నించలేదని అన్నారు. ప్రశ్నించేందుకే వచ్చానంటూ 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పవన్ గత ఐదేళ్లలో ఏం ప్రశ్నించారు? అంటూ మండిపడ్డారు.