సరిహద్దుల వద్ద భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తూర్పు లడఖ్లో చైనా వాయుసేన కార్యకలాపాలు మరింత విస్తృతమయ్యాయి. యుద్ధం జరిగితే పీవోకేను వినియోగించుకుని దాడి చేయాలని చైనా భావిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సైన్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ బేస్ల నుంచి భారీగా ఆయుధ వ్యవస్థలు లడఖ్ చేరుకుంటున్నాయి. ఇరు దేశాలు పెద్ద ఎత్తున సరిహద్దుల వద్దకు సైనికులు, యుద్ధ సామగ్రిని తరలిస్తున్నాయి. స్కర్దూ స్థావరంలో ట్యాంకర్ విమానం ఉంచింది. ఇది గాల్లోని యుద్ధవిమానాలకు ఇంధనం అందిస్తుంది.
టిబెట్ వంటి ప్రాంతాల నుంచి యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచి, అక్కడి నుంచి వాటిని తీసుకెళ్లడం క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి పీవోకేను ఇందుకు వినియోగించుకోవాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదే స్కర్దూ స్థావరాన్ని జే 17 విమానాలకు అనువుగా ఉండేలా పాకిస్థాన్ అభివృద్ధి చేసింది.