telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ పొగిడేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి…

సీఎం కేసీఆర్‌ రిజిస్ట్రేషన్లపై తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. పాత పద్దతిలోనే తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లు ప్రారంభించడం సంతోషమన్నారు జగ్గారెడ్డి. ఇక ఎల్ఆర్ఎస్ పై నిర్ణయం తీసుకోవడం ఒకటి మిగిలుపోయిందని.. ఇపుడున్న ఆర్ధిక పరిస్థితుల్లో ఈ కరోనా మహమారితో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం 2 లేదా 3 లక్షలకు ఫ్లాట్ కొన్న వ్యక్తి ఇప్పుడు అదే ధరతో ఎల్ ఆర్ ఎస్ కట్టాల్సి వస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆ డబ్బులు కట్టలేరని… కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గా రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక భారం కాకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ని రద్దు చేస్తూ కట్టుకున్న ఇండ్లను, ఫ్లాట్ లను రెగ్యూలరైజ్‌ చేసుకోవడం కోసం ప్రజలకు ఆర్ధిక భారం కాకుండా 10 వేల రూపాయలు నామమాత్రంగా రుసుము ఉండేలా చూడాలని రిక్వెస్ట్‌ చేశారు జగ్గారెడ్డి. ఈ నిర్ణయాన్ని త్వరగా సీఎం కేసీఆర్‌ తీసుకుంటే…రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని కోరారు..

Related posts