మేఘ ఇంజినీరింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 30 చోట్ల ఉన్న కంపెనీకి సంబంధించిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని బాలానగర్ కార్యాలయం, జూబ్లీ హిల్స్ చెక్పోస్టు కార్యాలయం, ఎంసీహెచ్ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
సోదాల్లో భాగంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.పోలవరం మెయిన్ డ్యాం రివర్స్ టెండరింగ్లో ఏకైక్ బిడ్ వేసి, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కాంట్రాక్టు దక్కించుకున్న నేపథ్యంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం.
యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాజధాని ఉండాలి: చంద్రబాబు