telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాజధాని ఉండాలి: చంద్రబాబు

chandrababu

యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాజధాని ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తే మీ రాజధాని ఏదని వారిని అడిగితే మూడు రాజధానుల పేర్లు చెప్పడానికి సిగ్గుపడతారు. ఒకవేళ విద్యార్థులు తమ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయని చెబితే.. మూడు రాజధానులు ఏంటయ్యా? అని వారిని ఎగతాళి చేస్తారు.

అమరావతి రాజధాని గురించి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నేను ఇటీవల అమరావతిలో పర్యటించడానికి వస్తే బస్సుపై కర్రలతో, చెప్పులతో దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయవచ్చని డీజీపీ అన్నారు. మరి అమరావతి రైతులు నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Related posts