telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..నలుగురికి గాయాలు

tdp ycp

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. అనేక సందర్భాల్లో బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకొంది. నాదెండ్ల ఎస్సీ కాలనీలో ఇరు పార్టీలకు చెందిన వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన నలుగురు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణుల ఇళ్ల ముందు వైసీపీ శ్రేణులు బాణసంచా కాల్చాయి. ఈ క్రమంలో బాణసంచా పేలి పక్కనున్న ఇళ్లపైన, గడ్డివాములపైనా పడి మంటలు చెలరేగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి పుల్లారావు స్పందిస్తూ వైసీపీ కవ్వింపులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని అన్నారు.

Related posts