telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి ఆస్పత్రిలో మరణాలు….

Ayyanna

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. పచ్చి అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి… 30 మంది చనిపోతే 11 మంది అని చెప్పడం దారుణం. ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి ఆస్పత్రిలో మరణాలు సంభవిస్తున్నాయి అన్నారు. వాస్తవాలు చెప్పేవారిని బెదిరించి, అసత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలు మానాలి.. వాస్తవాలు ఒప్పుకోండి. కళ్లు తెరిచి ప్రజలను కాపాడటానికి ప్రయత్నించండి. కరోనా వల్ల చనిపోయిన 9వేల మందివి ప్రభుత్వ హత్యలే. దీనిపై సీఎం, ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేయాలి. ప్రైవేటు అంబులెన్స్ లు దోపిడీకి పాల్పడుతున్నారు… అధికారులు చర్యలు తీసుకోవాలి. బుల్లెట్ ఫ్రూఫ్ కారులు కొనడంలో వున్న శ్రద్ద… కరోనా పై లేదు. ఆస్పత్రిలో సిబ్బందికి  మాస్క్ లు, కిట్లు ఏర్పాటు చేయాలి. కరోనా పేషెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తింపు ఒట్టిమాటే అన్నారు. రేషన్ వేన్లలో మందు సరఫరా చేస్తే బావుంటుందేమో సీఎం ఆలోచిస్తే బావుంటుంది అని పేర్కొన్నారు.

Related posts