telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఎన్ కౌంటర్ ప్రాంతంలో ఎన్ హెచ్ఆర్సీ పరిశీలన

disa accused Funeral will be tomorrow

తెలంగాణలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) బృందం పరిశీలించింది. దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద కాల్పులు జరిగిన ప్రదేశంలో పర్యటించారు.

అనంతరం దిశ నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురి మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికలను కూడా పరిశీలించారు. ఎన్ హెచ్ఆర్సీ బృందం పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts