మావోస్టులు ఈ నెల 8న అర్ధరాత్రి, ఇంట్లో నిద్రినిద్రిస్తున్న మాజీ ఎంపీటీసీ ని మాట్లాడాల్సి ఉంది రమ్మంటూ తీసుకెళ్లారు. నేడు ఆయన శవంగా కనిపించడంతో భద్రాద్రి జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. చర్ల మండలం పెదమిడిసీలేరుకు చెందిన టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావుని ఇన్ఫార్మర్ నెపంతో మావోలు దారుణంగా హతమార్చారు.
అతని మృతదేహం నేడు ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య లభ్యమైంది. మృతదేహం వద్ద ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లభ్యమైన లేఖలో, తమపై ఆదివాసీ ప్రజా సంఘాల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ఫార్మర్గా వ్యవహరించినందునే హత్య చేశామని మావోలు వెల్లడించారు.