వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని అన్నారు. హిందూమతంపై దాడులను నిరోధించాలని చేశారు. రామతీర్థం విగ్రహ విధ్వంసకులను పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. రాముడి విగ్రహం శిరస్సు తొలగించినవారిని ఎందుకు పట్టుకోలేకపోయారని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. చీకటి జీవోలతో తనను తొలగించిన ప్రభుత్వానిదే తప్పు.. అమలుచేసిన అధికారులది, సిబ్బంది తప్పు లేదని అన్నారు. ఇప్పటికైనా దాడుల సంస్కృతిని ప్రభుత్వం మానుకోవాలని.. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని అశోక్ గజపతిరాజు కోరారు.
previous post