తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అహంకారపూరిత ధోరణి వల్లే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని, వాటిని పరిష్కరించాలన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత వారితో కేసీఆర్ కార్మికులతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కార్మికుల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా… ఆర్టీసీని ప్రైవేటు పరం చేయలేరని వ్యాఖ్యానించారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని నారాయణ డిమాండ్ చేశారు.