telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెడ్లు, బ్రాహ్మణులే కాదు బీసీల్లోనూ సమర్థులున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

jaggareddy in pcc race in telangana

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి గురించి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారికి పీసీసీ అడిగే హక్కు వుందని అన్నారు. తమ పార్టీలో ధనిక, పేద అనే తేడా వుండదని అందరూ సమానులేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సమస్త కులాల వాళ్లూ వున్నారని అన్నారు. వారిలో చాలా మంది సమర్థవంతమైన నేతలున్నట్టు తెలిపారు.

రెడ్లు, బ్రాహ్మణులే కాదు, బీసీల్లోనూ సమర్థులున్నారని, వీహెచ్ కూడా పీసీసీ పదవికి సమర్థుడేనని, మాదిగ కులంలో దామోదర రాజనర్సింహ, మాలల్లో భట్టి విక్రమార్క వున్నారని అన్నారు. సామాన్య కార్యకర్త బొల్లు కిషన్ కూడా పీపీసీ అధ్యక్షుడయ్యే అవకాశం వుందని వ్యాఖ్యానించారు.

Related posts