లాక్డౌన్ అమలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పలు అంశాల పై సీఎం చర్చిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, ఇతర అంశాలపై సీఎం చర్చించారు. కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఎవరు మంత్రులుగా ఉన్నా జనాలకు ఒరిగేదేమీ లేదు: జగ్గారెడ్డి