ఐఏఎస్ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని తెలంగాణ సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాజ్యహింసతో భావప్రకటనా స్వేచ్ఛను సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కు రాజ్యాంగం అంటే లెక్కే లేదని, ఆయన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు.
ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్న కేసీఆర్ ను ప్రశ్నించాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ కు ఆర్టీసీ ఉద్యోగులపై కోపమెందుకు అని ప్రశించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతా : పవన్