ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో వైసీపీ కార్యకర్తలు హడావుడి చేశారు.వైసీపీ జెండాలు పట్టుకుని ఉండవల్లి నుంచి కరకట్ట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరిగి వెళ్లేటప్పుడు ప్రజావేదిక సమీపంలో బాణసంచా కాల్చుతూ బైబై బాబు, బైబై పప్పు అంటూ నినాదాలు చేశారు.
చిత్తూరుకు చెందిన టీడీపీ కార్యకర్త జోక్యం చేసుకుని.. చంద్రబాబును అనడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు అతనితో వాగ్వాదానికి దిగారు. మా నాయకుడు గెలిస్తే సంబరాలు చేసుకోకూడదా? ఇదేమైనా చంద్రబాబు రాజ్యమా అంటూ వాదనకు దిగారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించేశారు.