ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ను దాటుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మె ముందుకు సాగుతోంది. ఏదేమైనా డిమాండ్లు సాధిస్తామని కార్మికులు మెట్టు దిగడం లేదు. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డిపోల ముందు ధర్నాకు దిగి బస్సులను అడ్డుకున్న కార్మికులు, విపక్ష నేతల్ని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, మహిళా కండక్లర్ల ఆధ్వర్యంలో బాన్సువాడ బస్టాండ్ ముందు రాస్తారోకో చేపట్టారు. కేసీఆర్కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైతు భరోసాపై అట్టుడికిన అసెంబ్లీ.. చంద్రబాబు పై రోజా విమర్శలు