telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్.. జగన్‌పై ప్రేమ చూపుతున్నారు: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌ పై  ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ద్వాజమెత్తారు. ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్‌, కేటీఆర్‌లు జగన్‌పై ప్రేమ చూపుతున్నారని  మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరో బిహార్‌ చేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ సాయంతో కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌ రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే వీరి ఆలోచనన్నారు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు హెచ్చరించారు.

Related posts