telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది.. : ఏపీసీఎం బాబు

CM Chandrababu fire to CEC

నేడు మదనపల్లిలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ జగన్ పై మరియు మోడీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. మోడీ కరుడుగట్టిన తీవ్రవాది అని బాబు అన్నారు. జగన్ కావాలంటే కేసీఆర్ కు జీవితాంతం ఊడిగం చేసుకోమనండి. రాష్ట్రానికి మోడీ తీవ్రంగా అన్యాయం చేశాడు. ఓట్ల దొంగలను మోడీ కాపాడారు.

ఏపీలో రైతుల కోసం చంద్రన్న భీమా పెట్టాం. ఎన్నో కంపెనీలలో ఒప్పందాలు కుదుర్చుకున్నాము. దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. తిరుమల క్షేత్రాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని చూశారు, అంతటి కరుడుగట్టిన తీవ్రవాది మోడీ, అన్నారు చంద్రబాబు నాయుడు.

Related posts