telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మోదీ చేసిన అభివృద్ధిని టీడీపీ విమర్శించడం సిగ్గుచేటు: సోము

Somu veerraju Slams Chandrababu
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం విమర్శించడం సిగ్గుచేటని  బీజేపీ నేత, మండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధిలో మోదీ సహాయం లేకపోతే చంద్రబాబు జీరో అని వ్యాఖ్యానించారు.ఏపీ ఎన్నికల ప్రచారాన్ని  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్వరలోనే కడప నుంచి ప్రారంభిస్తారని వెల్లడించారు.
రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రజలే బుద్ధిచెబుతారని వీర్రాజు అన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రూ.ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వీర్రాజు ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదన్నారు. చంద్రబాబు అవినీతికి హద్దులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts