telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ ఎంపీ జీవీఎల్ కు మాతృవియోగం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం కలిగింది. జీవీఎల్ తల్లి చౌడేశ్వరి ఈరోజు కన్నుమూశారు. ఆమె వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు.జీవీఎల్ నరసింహారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా బల్లికురువ గ్రామం. 

జీవీఎల్ కు మాతృవియోగం కలిగిందన్న విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కన్నా తన సంతాపం తెలియజేశారు. జీవీఎల్ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో జీవీఎల్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జీవీఎల్ నరసింహారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా బల్లికురువ గ్రామం.

Related posts