నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి రౌండ్ లోనే ఆమె విజయం ఖరారైంది. మొత్తం 821 ఓట్లకు గాను కవితకు 531 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లకుండా వృధా అయిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థి శుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణలకు డిపాజట్లు కూడా దక్కలేదు. తొలి రౌండ్ లో బీజేపీ కి 39, కాంగ్రెస్ 22 ఓట్లు, వచ్చాయి.
కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగా.. మొత్తం 823 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి 29 ఓట్లు సరిపెట్టుకున్నారు. చెల్లని ఓట్లు 10 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కవిత విజయం ఖాయమనే ధీమా టీఆర్ఎస్ శ్రేణుల్లో మొదటి నుంచి ఉన్నప్పటికీ… ప్రత్యర్థులను ప్రతిఘటించలేదు. కనీసం డిపాజట్లు కూడా దక్కించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానములో ఓటమి చవిచూసిన కల్వకుంట్ల కవిత… ఇపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది.