telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ టీ20లో .. బంగ్లా గెలుపు..

bangladesh won on delhi t20

ఢిల్లీ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. షకీబల్, తమీమ్ ల గైర్హాజరీతో బలహీనపడిందనుకున్న బంగ్లాదేశ్ జట్టు అనూహ్యరీతిలో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేయగా, మరో మూడు బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ విజయతీరాలకు చేరింది. ఆ జట్టులో వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్భుత ఇన్నింగ్స్ తో అలరించారు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 20వ ఓవర్లో మూడో బంతికి తాత్కాలిక సారథి మహ్మదుల్లా సిక్స్ కొట్టడంతో బంగ్లా విజయం సాధించింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది.

Related posts