ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ టీడీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ధీమా వ్యక్తం చేశారు. 130 స్థానాలు టీడీపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. మొన్న జరిగిన పోలింగ్కు తక్కువ బలగాలు పంపడం కేంద్రం కుట్రలో భాగమేనని విమర్శించారు.
టీడీపీపై మోదీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు సంక్షేమం, అమరావతి, పోలవరం అజెండాగా ఉందన్నారు. జగన్కు మాత్రం సీఎం అవ్వడం ఒక్కటే అజెండా అని ఎద్దేవా చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల సంగతి చూడాల్సిన అవసరం ఉందన్నారు.
సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్