telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఉద్యోగులకు రెండు విడతలుగా జీతాలు!

ap

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల వేతనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే జీతంలో కోత విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక తిరిగి చెల్లిస్తారని సూర్యనారాయణ పేర్కొన్నారు.

Related posts