telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.

ఏపీ మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకుని మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు.

ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ గా వస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుకు అటువైపున దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు.

ఈ ఘ‌ట‌న తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద జ‌రిగింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించిన అనంతరం.. మంత్రి కాన్వాయ్ కు మరమ్మత్తులు నిర్వహించి అక్కడి నుంచి తిరుపతికి తరలించారు.

Related posts