ఏపీ మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకుని మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు.
ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ గా వస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని, రోడ్డుకు అటువైపున దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు.
ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద జరిగింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించిన అనంతరం.. మంత్రి కాన్వాయ్ కు మరమ్మత్తులు నిర్వహించి అక్కడి నుంచి తిరుపతికి తరలించారు.
రాయల సీమలోనే మానవ హక్కుల ఉల్లంఘన: పవన్ కల్యాణ్