సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. దీంతోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఈ తొమ్మిది మందిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. తమ వారసుల కోసం జేసీ సోదరులు పోటీకి దూరంగా ఉంటామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో ఎక్కువ మంది సిట్టింగులకే చంద్రబాబు అవకాశం కల్పించారు.
ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులు వీరే:
అనంతపురం ఎంపీ అభ్యర్థి – జేసీ పవన్ కుమార్ రెడ్డి
రాప్తాడు – పరిటాల సునీత
పెనుకొండ – బీకే పార్థసారథి
రాయదుర్గం – కాలవ శ్రీనివాసులు
ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ
అనంతపురం – ప్రభాకర్ చౌదరి
హిందూపురం – బాలకృష్ణ
మడకశిర – ఈరన్న
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి