బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్ మార్కెట్లో మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 46,650 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45, 650 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.77,500 వద్ద కొనసాగుతోంది.
చంద్రబాబు, జగన్ ఇద్దరూ దొందూ దొందే: కన్నా