telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

పటమట పీఎస్ లో కరోన కలకలం.. ఐదుగురు పోలీసులకు పాజిటివ్‌

Corona

ఏపీలోని పటమట పోలీసు స్టేషన్లో కరోన కలకలం రేపింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐతో పాటు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిత్యం ప్రజలలో ఉంటూ విధులు నిర్వహిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులకు కూడా కరోనా రావడంతో పోలీసు యంత్రాంగం ఆందోళనకు గురవుతున్నారు.

పటమటలో ఒక మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోమ్ గార్డులకు కరోనా పాజిటివ్ అని తేలింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వీరు విధులు నిమిత్తం బయటకు వెళ్లి వస్తుండడం, స్టేషన్‌కు కేసుల నిమిత్తం ప్రజలు రావడంతో ఎక్కడైనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

Related posts