telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే..?

corona

ఏపీ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి.  ఏపీలో ఈ రోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,783 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,20,453 కు చేరింది.  ఇందులో 7,89,188 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 24,575  కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 14 మరణాలు సంభవించాయి.  దీంతో ఏపీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6,690 కి చేరింది.  ఇక ఇదిలా ఉంటె, ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.  అనంతపూర్ లో  170, చిత్తూరులో 351, తూర్పుగోదావరి జిల్లాలో 371, గుంటూరులో 324, కడపలో 169, కృష్ణాలో 425, కర్నూలులో 34, నెల్లూరులో 86, ప్రకాశంలో 134, శ్రీకాకుళంలో 67, విశాఖపట్నంలో 113, విజయనగరంలో 70, పశ్చిమ గోదావరిలో 469 కేసులు నమోదయ్యాయి.

Related posts