ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అననతరం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతిరోజూ ఎందరో కలుస్తున్నారు. అమరావతిలోని ప్రజావేదిక వద్ద తనను కలిసేవారితో ఫొటోలకు పోజులిస్తూ, టీడీపీ ఓటమి పట్ల బాధపడుతున్న వారిని ఓదార్చుతూ చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో వేంపాటి కృష్ణవేణి అనే ప్రవాసాంధ్రురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీకి రూ.5 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో చంద్రబాబుకు అందజేశారు. పార్టీ పట్ల అభిమానంతో విరాళం ప్రకటించిన కృష్ణవేణిని, ఆమె కుటుంబాన్ని చంద్రబాబు అభినందించారు.