సౌతాఫ్రికా తో భారత్ నేడు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో స్వల్ప వ్యవధిలోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు చేజార్చుకుని కొద్దిసేపు నిలకడగా ఆడింది. భారీ షాట్లకు ప్రయత్నించకుండా ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. డుప్లెసిస్, వాన్ డర్ డుస్సెన్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఓవర్ల నుంచి హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్లతో విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయించాడు.
బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడకపోగా.. వికెట్ కాపాడుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే చాహల్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని డుస్సెన్(22) రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించి బౌల్డ్ అయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన డుప్లెసిస్(38) కూడా అదే ఓవర్ ఆఖరి బంతికి బౌల్డ్ కావడంతో పీకల్లతో కష్టాల్లో పడింది. 21 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 85 పరుగులు చేసింది. మిల్లర్(4), డుమిని(2) క్రీజులో ఉన్నారు.