telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

16 ఎంపీ స్థానాలు తొడగొట్టి సాధిస్తాం: కేటీఆర్

KTR Tribute to CRPF Jawans  Hyderabad
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి కేసీఆర్, టీఆర్ఎస్‌పై చంద్రబాబు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం భాగంగా కేటీఆర్  శనివారం నాగర్‌కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మూడుసార్లు నాగర్‌కర్నూలు టీఆర్ఎస్ చేజారిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక పార్లమెంటు పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటయ్యాయన్నారు. రానున్న ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు తొడగొట్టి సాధిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
వ్యవసాయం దండగన్న ఏకైక ముఖ్యమంత్రి బాబేనని కేటీఆర్ గుర్తుచేశారు. మోడీ, చంద్రబాబులు కేసీఆర్ రైతు బంధును పేరు మార్చి అమలు చేస్తున్నారన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంటు పరిధిలో 4,98,637 మంది రైతులకు రైతు బంధు సాయం అందిందని కేటీఆర్ తెలిపారు. 43 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందుతున్నాయన్నారు. మే నుంచి ఆ మొత్తం రూ.2016 రూపాయలు పెరుగుతుందన్నారు. పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి వృద్దులకు కేసీఆర్ మేలు చేశారన్నారు. పాలమూరు వెనుకబడే వుండాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.

Related posts