నారా చంద్రబాబునాయుడికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్లో విహారయాత్రకు వెళ్లిన చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో గన్నవరం చేరుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అధినేతకు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి నేరుగా ఉండవల్లి వెళ్లారు. అప్పటికే ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఏం జరుగుతుందోనని నేతలు ఆందోళన చెందారు. చంద్రబాబు నేరుగా ఇంటికి చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేటి నుండి మళ్ళీ బాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతలతో సమీక్షలు జరగనున్నాయి.