telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఉపాధి హామీ పనుల్లో విషాదం.. మట్టిపెళ్లలు పడి 10 మంది కూలీలు మృతి

upadhi-hami-workers
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఉపాధి పనులు చేస్తున్న  కూలీలపై మట్టిపెళ్లలు పడడంతో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను తోటి కూలీలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
తీలేరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు గ్రామ సమీపంలోని మట్టి పనికి వెళ్లారు. అయితే మట్టి తవ్వుతున్న సమయంలో ఒక్కసారిగా మట్టి పెళ్లలు మీద పడ్డాయి. దీంతో  కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మట్టి పెళ్లల కింద ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 15 మంది పనిచేస్తున్నట్టుగా కూలీలు చెబుతున్నారు. ఇప్పటికే ఏడు మృతదేహాలను వెలికితీశారు. మట్టి పెళ్లల కింద మరో 10 మంది చిక్కుకొని ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Related posts