విజయవాడ సమీపంలో పెద్దమొత్తంలో గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. ఇసుక లారీలో తరలిస్తున్న రూ.2కోట్లు విలువచేసే గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్కు ఇసుక లారీలో 1137.30 కిలోల గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో డీఆర్ఐ నిఘా అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రెండున్నర కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.