telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆర్టీసీ వోల్వో బస్సులో మంటలు..

Tsrtc Special Buses for Sankranti
విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన వోల్వో బస్సులో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవరు అప్రమత్తమై వాహనాన్ని నిలిపేసి ప్రయాణికులను దింపేశారు. ఇబ్రహీంపట్నం నుంచి జూపూడి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 
టీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఈ బస్సు  50 మంది ప్రయాణికులతో ఉదయం హైదరాబాద్‌ బయలుదేరింది. కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం మండలం జూపూడి వద్దకు బస్సు వచ్చేసరికి హఠాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. పొగలు గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏసీ బస్సు కావడంతో పొగలు బస్సు అంతర్భాగంలోకి వెళ్లినా పెద్దప్రమాదం జరిగేది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Related posts