క్విటో, ఈక్వెడార్లోని అతిపెద్ద జైలులో రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య భీకరస్థాయి కాల్పుల్లో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. దీంతో జైలు అంతా రక్తపాతంతో నిండిపోయింది.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కార్టెల్స్తో సంబంధం ఉన్న జైలు ముఠాల మధ్య దాదాపు 8 గంటలపాటు తుపాకులతో కాల్పులు జరుపుకున్నట్లు తెలిసింది. గుయాక్విల్లోని తీరప్రాంత నగరమైన జైలులో తెల్లవారుజామున ఈ దారుణం జరిగినట్లు అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రసారమయ్యే వీడియోలు చూస్తే జైలు లోపల నేలపై పడి ఉన్న మృతదేహాలు, కొన్ని కాలిపోయాయి. దాదాపు 900 మంది పోలీసులు ముఠాల మధ్య ఘర్షణలను అదుపులోకి తెచ్చారని తెలిపారు.ఇటీవల సెప్టెంబర్ 28న లిటోరల్ పెనిటెన్షియరీలో జరిగిన అల్లర్లలో 119 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.