*బంజారాహిల్స్లోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కలకలం
*150మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
*రాసిడన్ బ్లూ హోటల్ లో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు
*పోలీసుల అదుపులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్
*పట్టుబడ్డవారిలోసినీ, రాజకీయ ఉన్నతాధికారులు పిల్లలు
*పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి..
హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈహోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలోనూ పబ్ లో పార్టీ జరుగుతుండగా దాడిచేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు బృందం యువతీయువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పబ్ నిర్వహకులతో పాటు మొత్తం 150మందిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.. వీరిలో 39మందివరకు యువతులు వున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ప్రముఖ గాయకుడు, బిగ్బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కూతురు నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.
పబ్ యాజమాన్యం యువతీ యువకులతో లేట్ నైట్ పార్టీలు నిర్వహించడమే కాదు వారికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ దాడిలో భారీగా డ్రగ్స్ ను కూడా పట్టుబడింది. పట్టుబడిన యువతీ యువకుల్లో చాలామంది డ్రగ్స్ మత్తులో వున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో కొకైన్, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్, ఎల్ఎస్డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. తమ అదుపులో ఉన్న యువతీ యువకుల నుంచి పోలీసులు వివరాలను సేకరించిన అనంతరం వారిని వదిలిపెట్టారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ యజమానులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫుడింగ్ మింగ్ పబ్ను సీజ్ చేశారు.