మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి రిషెప్షన్ వేడుక కనీ వినీ ఎరుగని రీతిలో జరిగింది. ఏడు లక్షల కుటుంబాలకు గోడ గడియారం, పెళ్లి కార్డు ఇచ్చి మరీ ఆహ్వానించారు.
ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో పొంగులేటి కుమార్తె స్వప్నిరెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి మనవడు అర్జున్రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది .
అయితే వివాహ రిషెప్షన్ మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని వంద ఎకరాల్లో రాజస్థాన్ ప్యాలెస్ను తలపించే భారీ సెట్టింగ్లో రిసెప్షన్ను జరుపుతున్నారు.
సినీ టెక్నిషియన్స్తో నిర్మించిన రాజస్థాన్ ప్యాలెస్ సెట్టింగ్లో రిషెప్షన్ వేడుక జరుగుతోంది. ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ మల్లిఖార్జున ఆధ్వర్యంలో ఈ సెట్టింగ్ నిర్మాణం జరిగింది. ఈ వేడుకలో సుమారు 3 లక్షల మంది అతిథులు భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఇటీవల హైదరాబాద్లో ప్రధాని మోదీకి తెలంగాణ వంటకాలు రుచి చూపించిన యాదమ్మతో ప్రత్యేకంగా వంటలు తయారు చేయించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా భోజనాలు వడ్డించారు.
ఈ రిసెప్షన్కు తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.