తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మంజీరా నీటి పారుదల ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని ఉత్తమ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రైతులు, పారిశ్రామిక కార్మికుల కడగండ్లను మరింత పెంచుతున్నారని ఆరోపించారు.
మంజీరా ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను ప్రాజెక్టు వద్దకు వెళుతుంటే అడ్డుకున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఎందుకంత భయమో అర్థం కావడంలేదని, తనను మూడ్రోజుల వ్యవధిలో రెండుసార్లు అరెస్ట్ చేశారని అన్నారు.
చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడు: విజయసాయి