ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు.పాల్వంచకు చెందిన శ్రావణి పురిటి నొప్పులతో భద్రాచలంలోని సురక్ష ఆస్ప త్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు నార్మల్ డెలివరీ కాదని నిర్ధారించి, సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు.
వైద్యులు డాక్టర్ శ్రీక్రాంతి, డాక్టర్ అక్కినేని లోకేష్, నర్సుల బృందం సోమవారం సాయంత్రం ఆపరేషన్ చేశారు. ప్రసవంలో ఆమెకు 5 కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. మంచి బరువుతో బిడ్డను కన్న శ్రావణిని వైద్యులు ప్రశంచించారు.
సహజంగా పిల్లలు రెండున్నర నుంచి నాలుగు కిలోల వరకు జన్మిస్తారని, ఐదు కేజీలు ఉండడం అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి 1000 మందిలో ఒకరు మాత్రమే ఇలా అధిక బరువుతో జన్మిస్తారని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వివరించారు.
పోషకాహారం తినడం వల్ల ప్రసవానంతరం తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పుండదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు ..ప్రస్తుతం ఈ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది..